ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం పుష్ప ది రైజ్ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.
శేషాచలం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుండగా.. సునీల్, అనసూయలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
రేపు ఏడు భాషల్లో పుష్ప మూవీ విడుదలకు ఇంకా కొద్ది గంటలు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో పుష్ప మూవీపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన వెలువరిచింది. ఈ నెల 30 వరకు ఐదు షోలు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో బన్నీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో మూవీ మేకర్స్ కు తక్కువ సమయంలోనే పుష్ప మంచి వసూళ్లు రాబట్టడం ఖాయమని తెలుస్తోంది. ఇక భారీ అంచనాల నడుమ విడుదలకానున్న పుష్ప మూవీ విడుదలకి ఒక్కరోజు ముందే పాజిటివ్ టాక్ వినిపిస్తుంది.
ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ కీలకపాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియాతో కలిసి సంయుక్తంగా నిర్మించింది.