బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనమ్ పాండేపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. కాగా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ తన బీఎండబ్ల్యూ కారులో ముంబై మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో రాత్రి 8 గంటల సమయంలో హాయిగా షికార్లు కొడుతున్న పూనమ్ పాండేను పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి కారణం లేకుండా రోడ్లపై షికారు చేస్తూ లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పూనం పాండేపై ఐపీసీ సెక్షన్ 188, 269, 51 (బి) ల కింద కేసు నమోదు చేశారు ముంబై పోలీసులు. అలాగే ఆమె బీఎండబ్ల్యూ కారును స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ విషయాన్ని ముంబై సీనియర్ పోలీసు ఇన్స్పెక్టర్ మృత్యుంజయ్ హీరేమత్ మీడియాకు తెలిపారు. పూనం పాండేతో పాటు కారులో ఉన్న శామ్ అహ్మద్ బాంబే అనే వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. గతంలో చాలాసార్లు ఎన్నో వివాదాలతో వార్తల్లో నిలిచింది పూనమ్ పాండే. హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాపై బాంబే హైకోర్టులో ఫిర్యాదు చేసి అప్పట్లో సంచలనం సృష్టించింది. నాషా, లవ్ ఈజ్ పాయిజన్, మాలిని అండ్ కో, ఆగయా హీరో, ది జర్నీ ఆఫ్ కర్మ తదితర సినిమాల్లో ఆమె నటించింది. ఇక పూనమ్ పాండే సోషల్ మీడియా ఖాతాలు చూస్తే దిమ్మతిరిగిపోతుంది. సెక్సీ ఫోటోలు, వీడియోలతో సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తుంటుంది ఈ హాట్ బ్యూటీ.
previous post
next post