తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ “సినీ మహోత్సవం… రథసారథుల రజతోత్సవం” సెప్టెంబర్ 8న హైదరాబాద్ గచ్చిబోలి ఇండోర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రొడక్షన్ మేనేజర్లందరూ కలిసి చేస్తున్న ఈ సిల్వర్ జూబ్లీ ఈవెంట్ కర్టన్ రైజర్ ఈవెంట్ ప్రెస్మీట్ జరిగింది. ఈ కార్యక్రమానికి కళాబంధు టి. సుబ్బిరామి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సి.కల్యాణ్, డా.రాజశేఖర్, వి.కె.నరేశ్, అల్లరి నరేశ్, సందీప్ కిషన్, డైరెక్టర్ బాబీ, రెజీనా కసండ్ర, శివ బాలాజీ, హేమ, రాజీవ్ కనకాల, రఘు, వెన్నెలకిశోర్, నిర్మాత అశోక్, దామోదర్ ప్రసాద్, ఉత్తేజ్, బొమ్మరిల్లు భాస్కర్, ప్రగ్యాజైశ్వాల్, సంపూర్ణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కళాబంధు టి.సుబ్బరామి రెడ్డి మాట్లాడుతూ “హైదరాబాద్ నగరంలో సినీ ఆర్టిస్ట్లందరూ కలిసి చాలా కాలం అయ్యింది. చాలా గ్యాప్ తరువాత ప్రొడక్షన్ మేనేజర్లు కలిసి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసుకోవడం సంతోషంగా ఉంది. సెప్టెంబర్ 8న జరగబోయే ఈ ఫంక్షన్ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ ఈవెంట్ కు సపోర్ట్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు” అన్నారు.
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ప్రెసిడెంట్ అమ్మిరాజు మాట్లాడుతూ “మేం చేస్తున్న ప్రయత్నానికి సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమంలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే పెద్ద మనసుతో క్షమించాలి. సపోర్ట్ చేస్తోన్న జెమినీ కిరణ్గానిరి థ్యాంక్స్. రు బాగా సపోర్ట్ చేస్తున్నారు, వారికి థాంక్స్. సుబ్బిరామి రెడ్డి గారు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. పేరు పేరున ఈ ఈవెంట్ సక్సెస్ చేసిన వారందరికి థాంక్స్ తెలుపుతున్నాను. సెప్టెంబర్ 8న జరగబోయే ఈ ఫంక్షన్కు ఇలాగే అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.