telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆరు నెలల్లో కేవలం 21 రోజులు మాత్రమే విరాట్ తో… : అనుష్క

Anushka-Sharma-and-virat-Kohli

విరుష్క అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే జంట విరాట్ కోహ్లీ, అనుష్కలలది. ‘జీరో’ సినిమా తర్వాత మరో సినిమాలో కనిపించలేదు అనుష్క. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఇండియన్ ఉమెన్ క్రికెటర్ ఝులన్ గోస్వామి బయోపిక్‌గా రానున్న ‘చక్దాహా ఎక్స్‌ప్రెస్’ సినిమాలో నటించేందుకు రెడీ అయింది. కానీ ఈ మూవీ షూటింగ్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో చిట్ చాట్‌లో పాల్గొన్న అనుష్క శర్మ.. తన వైవాహిక జీవితంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ”లాక్‌డౌన్ కారణంగా కోహ్లీతో గడపడానికి ఎక్కువ సమయం దొరికింది కదా.. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు” అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఓపెన్ అయింది ఈ ముద్దుగుమ్మ. ”నిజం చెప్పాలంటే పెళ్లయ్యాక మొదటి ఆరు నెలల్లో కేవలం 21 రోజులు మాత్రమే కలిసున్నాం. ఇద్దరం బిజీగా ఉండడమే అందుకు ప్రధాన కారణం. ఇప్పుడు మాత్రం చాలా రోజులు కలిసున్నాం. చాలా హ్యాపీ” అనేసింది అనుష్క. అందరి ముందే ఆమె ఇలా ఓపెన్ కావడంతో నెట్టింట ఈ మ్యాటర్ హాట్ ఇష్యూగా మారింది. నిజానికి క్రికెట్ కోసం విరాట్ కోహ్లీ, సినిమాల కోసం అనుష్క శర్మ తమ జీవితాలను బిజీ బిజీగా గడుపుతుంటారు.

Related posts