21 ఏళ్లుగా హిందీ చిత్రసీమలో ఎవర్ గ్రీన్ కథానాయికగా మురిపిస్తోంది కరీనా కపూర్. అయితే గ్లామర్ ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. చాలామంది హీరోయిన్లానే ఈ అందాల తార ప్రొడ్యూసర్ అవతారం ఎత్తింది.
తొలి చిత్రంగా థ్రిల్లర్ కథాంశాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ‘స్కామ్ 1992’ వెబ్ సిరీస్ తో సంచలనం సృష్టించిన హన్సల్ మెహతా దర్శకత్వం వహించనున్నాడు. ప్రముఖ దర్శకుడు హన్సల్ మెహతా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో యూకే నేపథ్యంగా సాగే కథ ఇదని తెలుస్తోంది. ఏక్తా కపూర్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ‘‘హన్సల్ మెహతా చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది’’అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది కరీనా. ప్రస్తుతం కరీనా ఆమిర్ఖాన్తో కలిసి ‘లాల్ సింగ్ ఛద్దా’ చిత్రంలో నటిస్తోంది. …
కరీనా నిర్మాతగా తొలి చిత్రం మరో డైనమిక్ లేడీ ప్రొడ్యూసర్ బాలాజీ ఫిల్మ్స్ అధినేత్రి ఏక్తా కపూర్ తో చేతులు కలుపుతోంది. సినిమా చాలా వరకూ యూకేలో షూట్ చేస్తారని సమాచారం. గతంలో ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా కోసం కలసి పని చేసిన ఏక్తా, కరీనా ఇప్పుడు మరోసారి చేతులు కలపబోతున్నారు. కాగా.. ప్రస్తుతం కరీనా ఆమిర్ఖాన్తో కలిసి ‘లాల్ సింగ్ ఛద్దా’ చిత్రంలో నటిస్తోంది.