టాలీవుడ్ హీరో నాగశార్య, రీతూవర్మ జంటగా నటించిన కుటుంబ కథాచిత్రం ‘వరుడు కావలెనుస. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబరు 15న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కొత్త పోస్టర్ను విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన సాంగ్, పోస్టర్, టీజర్ సినిమాపై పాజిటివ్ బజ్ను క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ‘దిగు దిగు నాగ’ సాంగ్ చార్ట్ బస్టర్గా నిలిచింది. నాగ శౌర్య రీతు వర్మ జంట వారి కెమిస్ట్రీ ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది.
ఈ చిత్రానికి లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ.. పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్.. ‘వరుడు కావలెను’.. ఇందులో నదియా, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, ప్రవీణ్, హర్ష వర్థన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.