telugu navyamedia
సినిమా వార్తలు

డ్రగ్స్ కేస్ విచారణకు హాజరైన ఛార్మి… ఈడీ ప్రశ్నల వర్షం

టాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో డ్రగ్స్ కేస్ కలకలం రేపుతుంది. ఈ కేసులో తాజాగా… టాలీవుడ్ నటి చార్మి ఈడి అధికారుల ముందు హాజరైంది. డ్రగ్స్‌ సరఫరా చేసే కెల్విన్‌తో చార్మీ వాట్సాప్‌ చాటింగ్‌ చేసినట్లు సమాచారం. దీంతో చార్మి ప్రొడక్షన్‌ హౌస్‌ ఆర్థిక లావాదేవీలపై కూడా ఈడీ ఆరా తీస్తున్నారు.

Tollywood Drugs Case: Actress Charmi To Be Questioning At Ed Court - Sakshi

ముఖ్యంగా డ్రగ్స్ సరఫరా చేసే కెల్విన్ మరియు ఛార్మి మధ్య వాట్సాప్ చాటింగ్ పై ఆరాతీస్తున్నారు వీడియో అధికారులు. డ్రగ్స్ సరఫరా చేసే కెల్విన్ ఇచ్చిన సమాచారంతో నే నటి చార్మీని ప్రశ్నిస్తున్నారు ఈడి అధికారులు. కెల్విన్ కు భారీగా నగదు ట్రాన్స్ఫర్ చేసినట్లు ఈడీ వద్ద కీలక ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది.

10tvnews

అటు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డ్రగ్స్‌ పెడ్లర్‌ కెల్విన్‌ అప్రూవర్‌గా మారడంతో పలువురు టాలీవుడ్‌ నటీనటుల పేర్లు బయటకి వచ్చాయి. కెల్విన్ సెల్ ఫోన్ లో సినిమా వాళ్ళ పేర్లను గుర్తించిన అధికారులు ఎక్సైజ్ శాఖ సీజ్ చేసిన సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు. ఛార్మి పేరుని దాదా పేరుతో కెల్విన్ సేవ్ చేసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు.

Charmme Kaur rubbishes wedding rumours, says she will never get married in life - Movies News

అలాగే ఛార్మి కి సంబంధించిన బ్యాంకు అకౌంట్లను కూడా సమూలంగా పరిశీలిస్తున్నారు. ఇవాళ సాయంత్రం వరకు ఈడీ విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కాగా ఆగస్టు 31న టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ ను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఇవాళ ఛార్మీని విచారిస్తోంది ఈడీ.

Tollywood Drugs Case: ఈడీ ఆఫీసుకు చేరుకున్న ఛార్మి.. కార్యాలయం దగ్గర బౌన్సర్ల హంగామా..

కాగా.. అంత‌కు ముందు ఛార్మి తో పాటు విచారణకు ఆమె చార్టెడ్ అకౌంటెంట్ సతీష్ కూడా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు ఈడీ కార్యాలయం ముందు ఛార్మి బౌన్సర్లు హంగామా ‏చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రైవేట్ బౌన్సర్స్‏ను ఛార్మి నియమించుకున్నారు. దాదాపు 15 మంది బౌన్సర్లు ఈడీ కార్యాలయం ఉండడం గమనార్హం..

Related posts