telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వితంతువుకు సోనూసూద్ రాఖీ గిఫ్ట్

Sonu-Sood

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా సోనూసూద్ పేరు మారుమ్రోగిపోతోంది. ఆపదలో ఉన్నవాళ్లకు అండగా నేనున్నాను అంటూ పెద్ద మనసుతో ముందుకొస్తున్నారు సోను. తాజాగా రక్షాబంధన్ సందర్భంగా సోనూ సూద్ మరో గొప్ప పనికి శ్రీకారం చుట్టాడు. ఓ వితంతువుకు సాయం చేసి మ‌రోసారి తాను మ‌న‌సున్న మారాజునంటూ నిరూపించుకున్నాడు. అస్సాంలో ఇటీవల వరదలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ జ‌ల్‌పైగురి ప్రాంతంలో వ‌ర‌ద‌ల కార‌ణంగా ఓ మ‌హిళ పూరి గుడిసె పూర్తిగా ధ్వంస‌మైంది. ఆమెకు భ‌ర్త కూడా లేరు. పిల్ల‌లు తిన‌డానికి కూడా తిండి లేని దీన స్థితిలో ఉన్నారు. స్థానికులు ఓ గుడిసెను నిర్మించి ఇస్తే ఆమె అందులో ఉంటుంది. అయితే వర్షాలు, వరదల ధాటికి అదికూడా పూర్తిగా దెబ్బతింది. దీంతో దెబ్బ‌తిన్న గుడిసెను వీడియో తీసి దాన్ని సోనాల్ సింఘ్ అనే మ‌హిళ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. మీరు మాత్రమే ఈమెను ఆదుకోగలరంటూ మహిళ ట్వీట్‌లో పేర్కొంది. దీంతో వెంటనే ఆ ట్వీట్ పై స్పందించిన సోనూ… రక్షాబంధన్ సందర్భంగా ఈ చెల్లెమ్మకు అసోంలో కొత్త ఇంటిని కానుకగా ఇస్తానంటూ ట్వీట్ చేశాడు. ఏ మాత్రం ఆలోచించకుండా వెంట‌నే ఆమెకు రాఖీ పండుగ‌రోజు వ‌రాన్ని ప్ర‌సాదించారు. దీంతో మ‌రోసారి సోష‌ల్ మీడియాలో సోనూపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు నెటిజన్లు.

Related posts