ప్రస్తుతం మన దేశంలో కరోనా విజృంభిస్తుంది. రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దాంతో దేశంలో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. అయితే పరిస్థితి అదుపు తప్పుతుండటంతో కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ విధిస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోడి అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో కరోనా కరోనా కట్టడికి తీసుకోవాల్సిన నియంత్రణ చర్యలపై చర్చించనున్నట్లు సమాచారం. ఉదయం 11 గంటలకు వర్చువల్ విధానంలో సమావేశం జరుగనుంది. సమావేశంలో వివిధ రాష్ట్రాలలో వైరస్ పరిస్థితులపై ప్రధాని సమీక్ష చేయనున్నారు. అదే సమయంలో ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్, టీకాలు, అవసరమైన ఔషధాలపై లభ్యత తదితర ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు.
previous post
మరోసారి జడేజా పై మంజ్రేకర్ అనుచిత వ్యాఖ్యలు…