తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దీంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ఇప్పుడు గ్రామాలను సైతం వణికిస్తోంది.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించినవివరాల ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,176 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 8 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,004 మంది కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,79,246కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,48,139 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,070కు చేరింది. ప్రస్తుతం 30,037 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 308 కేసులు నమోదయ్యాయి.
బాబు గుడ్డలు చించుకుంటున్నారు: విజయసాయి