telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్‌లో మరో దారుణం… ఇంటికి తీసుకుపోయి విద్యార్థిని

మన దేశంలో ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. మహిళలపై దారుణాలు ఆగడం తగ్గడం లేదు. రోజు రోజు మహిళలపై రేప్‌లు పెరుగుతూనే ఉన్నాయి. మహిళలపై దాడులు చేసిన వారి పట్ల పోలీసులు ఎన్నికఠిన చర్యలు తీసుకున్నా… కొందరు దుర్మార్గులు మరడం లేదు. ఇది ఇలా ఉండగా.. హైదరాబాద్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. తాజాగా డిగ్రీ విద్యార్థిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. జూబ్లీహిల్స్‌ లో తన ఇంటికి పిలిచి మరీ డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం చేసాడు ఆ యువకుడు. ‌పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై ఆ యువకుడు అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే… కార్మికనగర్‌లో నివసించే డిగ్రి విద్యార్థిని.. బీటెక్‌ విద్యార్థి రాజు(23) రేప్ చేశాడు. మాట్లాడాలని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి… ఇంటికి పిలిపించి అత్యాచారానికి పాల్పడ్డాడు రాజు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై ‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Related posts