telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

శ్రీవారిని దర్శించుకున్న ఇద్దరు సీఎంలు

cm Jagan Tirumala

ఏపీ , కర్ణాటక రాష్ట్రాల  సీఎంలు వైఎస్ జగన్, యడియూరప్పలు ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి సన్నిధికి వచ్చిన యడియూరప్పకు మహాద్వారం వద్ద వైఎస్ జగన్ స్వాగతం పలికారు. స్వామి దర్శనం అనంతరం వేద పండితులు ఇద్దరు సీఎంలకు తీర్థ ప్రసాదాలు అందించారు.

అనంతరం ఆలయానికి ఎదురుగా ఉన్న నాద నీరాజనం వద్ద నిర్వహిస్తున్న సుందరకాండ పారాయణంలో ఇద్దరూ పాల్గొన్నారు. మరికాసేపట్లో కర్ణాటక సత్రాల భవన నిర్మాణ భూమి పూజలో పాల్గొననున్నారు. అనంతరం, 10:20కి రేణిగుంట ఎయిర్ ‌పోర్ట్ కు చేరుకోనున్న జగన్, అక్కడి నుంచి గన్నవరం బయల్దేరనున్నారు.

Related posts