telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కాబూల్ లో దారుణం.. సుప్రీంకోర్టు మహిళా జడ్జీలపై కాల్పులు

అఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో దారుణం చోటుచేసుకుంది. అటు ఉగ్రవాదం, ఇటు పేదరికంతో కొట్టుమిట్టాడుతుండే ఆసియా దేశం ఆఫ్ఘనిస్థాన్‌లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. రాజధాని కాబూల్‌లో జరిగిన ఈ దాడిలో ఇద్దరు మహిళా న్యాయమూర్తులు మృతి చెందారు. వారిద్దరూ సుప్రీం కోర్టులో జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. కోర్టు వాహనంలో తమ కార్యాలయానికి వెళుతుండగా వారిపై కాల్పులు జరిగాయి. కొందరు సాయుధులు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో ఆ మహిళా జడ్జిలు తీవ్ర గాయాలతో మృతి చెందారు. వారి వాహనం డ్రైవర్‌కు కూడా తూటాలు తగిలాయి. అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా… ఈ దాడి తాలిబన్ల పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఆ ఆరోపణలను తాలిబాన్‌ సంస్థ ఖడించింది.

Related posts