telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

సింగరేణి పవర్ ప్లాంటు ఆవరణలో పెద్ద పులి కలకలం

Tiger

మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు ఆవరణలో పెద్ద పులి కలకలం సృష్టించింది. పవర్ ప్లాంట్ రైల్వే ట్రాక్ వెంట వెళ్తున్న పెద్ద పులిని గూడ్స్ రైల్వే గార్డ్ గమనించారు. వెంటనే సింగరేణి పవర్ ప్లాంటు అధికారులకు ఈ సమాచారాన్ని అందించారు. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు.

గ్రౌండ్ లెవల్‌లో పనులను నిలిపివేశారు. కార్మికులను అప్రమత్తం చేశారు. అయితే పెద్దపులి సంచారంతో అధికారులు, కార్మికులు, పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా మంచిర్యాల జిల్లాలో పులి సంచరిస్తోంది. ఇటీవల రామకృష్ణాపూర్ ప్రాంతంలో పులి సంచరియంచినట్టు అధికారులు గుర్తించారు.

Related posts