తెలంగాణలో కరోనా వైరస్ చాపాకింద నీరులా విస్తరిస్తోంది. ఇటీవల జనగాం శాసనసభ్యుడు ముత్తిరెడ్డికి కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కరోనా బారినపడ్డారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది.
విషయం తెలిసిన వెంటనే ఆయన చికిత్స కోసం హైదరాబాదు బయల్దేరారు. ఎమ్మెల్యేకి కరోనా నిర్ధారణ కావడంతో ఆయన కుటుంబసభ్యులకు పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.
జగన్ గారి మొసలి కన్నీరు ఎందుకు?: బుద్ధా వెంకన్న