ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. రైతు సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దు చేశారని విమర్శించారు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ విత్తనాలు దొరకని పరిస్థితి నెలకొందని దుయ్యబట్టారు. రైతు “రుణమాఫీ” ప్రస్తావనే లేదని అన్నారు.మరోవైపు రైతు బకాయిలు కూడా చెల్లించకపోవడంతో సాగు చేసేందుకు పెట్టుబడిలేని పరిస్థితులు తలెత్తాయని వ్యాఖ్యానించారు. ఏదో విధంగా పెట్టుబడికి సిద్ధమైతే విత్తనాలు దొరకని పరిస్థితి నెలకొందన్నారు. రైతు సమస్యలు తలెత్తడానికి ప్రభుత్వ ప్రణాళికా లోపమేనని కారణమని విమర్శిస్తూ ఓ ట్వీట్ చేశారు.
చంద్రబాబు అమరావతిపై అసలే మాట్లాడలేదు: మంత్రి బుగ్గన