సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాల్లో వలసలు ఊపందుకున్నాయి. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నుంచి నేతలు పార్టీలు మారుతున్నారు. తాజాగా ప్రముఖ సినీ నటి జయసుధ వైసీపీ ఈరోజు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. గురువారం సాయంత్రం వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ను ఆమె కలవనున్నారు. జగన్ సమక్షంలో ఆమె వైసీపీలో చేరనున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు జయసుధ జగన్ నివాసానికి చేరుకుంటారని వైసీపీ వర్గాలు తెలిపాయి. అనంతరం జగన్ సమక్షంలో జయసుధ వైసీపీ కండువా కప్పుకొనున్నారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో జయసుధ 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఏడాది క్రితం జయసుధ టీడీపీలో చేరారు. ఆ తర్వాత టీడీపీ కార్యక్రమాల్లో ఆమె ఏనాడూ కూడ క్రియాశీలకంగా పాల్గొనలేదు.