telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అనంతపురం : వైసీపీలో తారాస్థాయికి చేరిన విభేదాలు

ycp ap

అనంతపురంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడేక్కాయి. ఆ జిల్లాలోని కళ్యాణదుర్గం వైసీపీలో తారాస్థాయికి చేరాయి విభేదాలు. ఎంపీ తలారి రంగయ్య ఫ్లెక్సీలు కట్టకుండా ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్ వర్గీయులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తల మధ్య అర్ధరాత్రి తీవ్రస్థాయి లో వాగ్వాదం
జరిగింది.  కళ్యాణదుర్గం టీ సర్కిల్ లో ఏర్పాటు చేసిన ఎంపీ రంగయ్య ఫ్లెక్సీలను తొలగించారు ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్ వర్గీయులు. అయితే…ఫ్లెక్సీలు తొలగించకుండా అడ్డుకుంటున్న ఎంపీ వర్గీయులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎమ్మెల్యే వర్గీయుల తీరుతో మనస్తాపం చెందారు ఎంపీ తలారి రంగయ్య. మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటనకు ఎంపీ రంగయ్య దూరంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

Related posts