telugu navyamedia
ఆంధ్ర వార్తలు

శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేసిన టీటీడీ

నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుద‌ల చేసింది. ఉదయం 9 గంటలకు ఆగస్టుకు సంబంధించి తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది

ఆగ‌స్టు నెల‌కు సంబంధించిన సుప్రభాతం, తోమాల‌, అర్చన‌, జులై నెల‌కు సంబంధించిన అష్టద‌ళ‌ పాద‌ ప‌ద్మారాధ‌న సేవ టికెట్లను నేటి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు విడుద‌ల చేయనున్నారు. మే 26వ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు భ‌క్తులు న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంది. 26వ తేదీ సాయంత్రం 6 గంట‌లకు ఆన్‌లైన్ డిప్ తీసి సేవా టికెట్లు పొందిన వారికి స‌మాచారం అందిస్తారు.

భ‌క్తులు ఆన్‌లైన్‌లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లు పొందాల్సి ఉంటుంది. అయితే జులై, ఆగ‌స్టు నెల‌ల‌కు సంబంధించిన వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజ‌ల్‌ సేవ‌, స‌హ‌స్రదీపాలంకార సేవా టికెట్ల బుకింగ్ మే 25వ తేదీ ఉద‌యం 9 గంట‌ల నుంచి మొద‌ల‌వుతుంది. .

Related posts