telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎస్సీ వారికీ లోన్లు ఇవ్వడం లేదు: బొండా ఉమా

tdp bonda uma counter on ycp comments

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు హయంలో తీసుకువచ్చిన పథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేయడంపై విరుచుకుపడ్డారు. బీసీ, ఎస్సీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్‌లు తమ కుర్చీ తాము తెచ్చుకొనేటట్టు ప్రభుత్వం చేసిందని దుయ్యబట్టారు.

ఎస్సీ వారికీ లోన్లు ఇవ్వడం లేదని,ఎస్సీల మీద దాడులు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. గెలిపించిన వారినే ప్రభుత్వం అణిచివేస్తుందని బొండా ఉమా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 నెలలలో వైసీపీ పాలనలో ప్రజలకు ఉపాయపగపడే పథకాలు ఏమి ప్రవేశపెట్టలేదని ఆయన విమర్శించారు.

చంద్రబాబు హయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన వారి భౌతికాయాన్ని స్వగ్రామానికి పంపేవారని.. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక అది రద్దు చేశారన్నారు. చంద్రన్న భీమా, పెళ్లి పథకం, అన్న కాంటీన్ వంటి ప్రజా పథకాల్ని రద్దు చేసారని మండిపడ్డారు.

Related posts