telugu navyamedia
తెలంగాణ వార్తలు

బీజేపీ కార్య‌క‌ర్త సాయి గణేష్ సూసైడ్: మంత్రి పువ్వాడకి తెలంగాణ హైకోర్టు నోటీసులు

*సాయిగణేష్ ఆత్మహత్య కేసులో పువ్వాడ అజయ్‌కు హైకోర్టు నోటీసులు
*రెండు వారాల్లో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని హైకోర్టు ఆదేశం..

ఖమ్మం జిల్లాకు చెందిన బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు హైకోర్టు శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది.

సాయిగణేష్ మృతికి మంత్రి, జిల్లా పోలీసులే కారణమంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సాయిగణేష్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరపాలని పిటిషనర్ కోరారు.

దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆరోపణలు ఎదుర్కొంటున్నపువ్వాడ అజయ్ కుమార్ సహా 8 మందిని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోపుఘటనపై వివరణ ఇవ్వాలని  ఆదేశించింది.

అయితే కేసు విచారణలో ఉన్నందున తమకు సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టును కోరారు. కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణ ఈనెల 29కు వాయిదా వేశారు.

Related posts