telugu navyamedia
క్రైమ్ వార్తలు

మ‌త్తుమందు ఇచ్చి అత్యాచారం.. ఆపై వీడియోలు తీసి..

మ‌న‌దేశంలో అమ్మాయిల‌కు విలువ లేకుండా పోతుంది. ఆకాతాయిల ఆగ‌డాల‌కు బలైపోతున్నారు. సోషల్ మీడియా లో పరిచయాలు పెంచుకున్న‌ కొంతమంది మృగాళ్లు.. యువతులపై దారుణానికి ఒడిగడుతున్నారు. ప్రేమ అంటూ మామ‌మాట‌లు చెప్పి లొంగ‌దీసుకుంటున్నారు. దీంతో అమాకులైన అమ్మాయిలు బ‌లైపోతున్నారు.

తాజాగా అకతాయి అయిన‌ ఓ విద్యార్థి సోషల్‌ మీడియాలో పరిచయమైన ట్రెయినీ ఎయిర్‌ హోస్టెస్‌పై.. లైంగిక దాడికి పాల్పడ్డాడు. మత్తుమందు ఇచ్చి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇన్‌స్టాలో ప‌రిచ‌య‌మైన ట్రెయినీ ఎయిర్‌ హోస్టెస్‌కు.. ఇంజనీరింగ్‌ విద్యార్థి మ‌త్తు మందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడిన ఈ దారుణ సంఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వెలుగులోకి వచ్చింది.

అంతేకాకుండా నిందితుడు లైంగిక దాడి దృశ్యాల‌ను కెమెరాలో రికార్డు చేసి యువ‌తి పై ప‌లుమార్లు లైంగిక దాడికి తెగ‌బ‌డినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితుడు అజిత్ త్రివేది ని న‌గ‌రంలోని వెజాల్పూర్‌లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఏడు నెల‌ల కింద‌ట ట్రెయినీ ఎయిర్‌ హోస్టెస్‌కు ఇన్‌స్టాగ్రాంలో త్రివేది పరిచయమయ్యాడు. ఆతర్వాత వారిద్దరూ ఫోన్‌ నెంబర్లు మార్చుకుని చాటింగ్‌ చేసుకునేవారు. అనంతరం వ్యక్తిగతంగా క‌లుసుకోవాల‌ని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే.. ఏప్రిల్‌లో యువ‌తిని త‌న ఇంటికి రావాల‌ని త్రివేది కోరగా.. యువతి అక్కడికి వెళ్లింది. ఆ తర్వాత నిందితుడు.. ఆమెకు కూల్‌డ్రింక్‌లో మ‌త్తుమందు క‌లిపి ఇచ్చాడు.

Related posts