నీరవ్ మోడీ లండన్ లో తన వ్యాపారం మొదలుపెట్టి, అక్కడే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలు వచ్చిన కొద్దీ రోజులలోనే భారత్ విదేశాంగ అధికారుల చొరవతో, లండన్ న్యాయస్థానం చర్యలు తీసుకోవడం మొదలు పెట్టింది.
దీనితో రెండు రోజుల క్రితం వారెంట్ జారిచేశారు. నేడు అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే దీనిపై నీరవ్ మోడీ కౌంటర్ దాఖలు చేసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇక ఈ అరెస్ట్ కూడా బీజేపీ ఎన్నికల వ్యుహంగానే ఉందని విశ్లేషకులు అంటున్నారు.