telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగరత్నమ్మ బయోపిక్‌లో అనుష్కనా..? సమంతనా..?

samanta

కర్ణాటక గాయని, ప్రముఖ యాక్టివిస్ట్ బెంగళూరు నాగరత్నమ్మ జీవిత కథ ఆధారంగా ఓ బయోపిక్‌ను తెరకెక్కించాలనుకుంటున్నారట సింగీతం శ్రీనివాసరావు. ఇక ఇందులో ప్రధాన పాత్రకు గానూ అనుష్కను సంప్రదించారట. అయితే కథను విన్నప్పటికీ.. ఆమె మాత్రం ఇంకా సినిమాకు సంతకం చేయలేదట. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సమంతను సంప్రదించాలని అనుకుంటున్నారట. ఒకవేళ అనుష్క ఈ సినిమాకు సంతకం చేయకపోతే.. ఆ స్థానంలో సమంతను తీసుకోవాలని భావిస్తున్నారట. మరి మొత్తానికి ఈ బయోపిక్‌లో నటించే అవకాశం ఎవరు సొంతం చేసుకుంటారో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా అనుష్క, హేమంత్ మధుకర్ దర్శకత్వంలో నిశ్శబ్దం అనే చిత్రంలో నటించింది. మాధవన్, అంజలి, శాలిని, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీని ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. కానీ కరోనా నేపథ్యంలో ఈ మూవీ విడుదల వాయిదా పడింది.

Related posts