telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కరోనాతో 10 మందికి పైగా మావోయిస్టులు మృతి

new mavo committee formed

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ కరోనా సోకుతోంది. అటు ఛత్తీస్ గఢ్ లో పలుగురు మావోయిస్టులు కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. దంతేవాడ, బీజాపూర్, సుకుమా జిల్లాల్లో సుమారు 100 మంది మావోయిస్టులు కరోనా బారిన పడ్డారు. కరోనా బారిన పడినవారిలో మోస్ట్ వాంటెడ్ మహిళా మావోయిస్టు సుజాత కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా దంతేవాడ జిల్లా దక్షిణ బస్తర్ అడవులలో కరోనాతో 10 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్లు ఆ జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ వెల్లడించారు. కరోనా సోకడం, కలుషిత ఆహారం తినడంతో మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. అంతేకాదు మృతి చెందిన వారిలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది.

Related posts