telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

కరోనా రోగిపై రేప్ ఎటాక్.. 24 గంటల్లో మహిళ మృతి

దేశంలో కరోనా కేసులు రోజు రోజు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్న కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో దారుణం చోటు చేసుకుంది. నర్సు చేతిలో అత్యాచారానికి గురైన 24 గంటల్లోనే ఓ మహిళా మృతి చెందింది. అసలు వివరాల్లోకి వెళితే.. 43 ఏళ్ల మహిళ కరోనాతో బాధపడుతూ ఏప్రిల్ 6న భోపాల్ మెమోరియల్ ఆస్పత్రి అండ్ రీసెర్చ్ సెంటర్ లో చేరింది. ఆ సమయంలోనే తనపై మెల్ నర్సు అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది. అయితే అప్పటికే మహిళా పరిస్థితి విషమించడంతో ఆమెను వెంటీలేటర్ పై ఉంచారు. వైద్యం పొందుతూ తాజాగా ఆమె మృతి చెందింది. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పొలీసులు నిందితున్ని 40 ఏళ్ల సంతోష్ అహిర్ వార్ గా గుర్తించారు. వెంటనే అతన్ని అరెస్ట్ చేసిన పొలీసులు భోపాల్ సెంట్రల్ జైలుకు తరలించారు.

Related posts