telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీలో కొత్తగా 1502 కరోనా కేసులు

ఏపీలో గత 24 గంటల్లో 63, 717 సాంపిల్స్‌ పరీక్షించగా.. 1502 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరో 16 మంది కరోనా బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 1525 మంది పూర్తి స్థాయిలో కోలుకున్నారు. దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,19,702 కు పెరగగా.. రికవరీ కేసులు 19,90,916 కు చేరాయి. ఇప్పటి వరకు కోవిడ్‌ బారినపడి 13,903 మంది మృతిచెందారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 14,883 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని.. కోవిడ్‌ టెస్ట్‌ల సంఖ్య 2, 68, 73, 491 గా ఉందని బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం. కోవిడ్ వల్ల చిత్తూర్ లో నలుగురు, కృ ష్ణ లో ముగ్గురు, పశ్చి మ గోదావరి లో ముగ్గురు, తూర్పు గోదావరి లో ఇద్దరు, గుం టూరు లో ఇద్దరు, కర్నూ ల్ లో ఒక్క రు మరియు ప్రకాశం లో ఒక్కరు మరణించారు.

Related posts