telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

బ్రేకింగ్‌ : ఏలూరులో 350 దాటిన బాధితుల సంఖ్య!

ఏలూరులో అస్వస్థతకు గురవుతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. నగరంలోని పది ప్రాంతాలకు చెందిన వారు… స్పృహ కోల్పోవడం, మెడ, నడుం నొప్పి, తల కళ్లు తిరగడం లాంటి లక్షణాలతో శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం రాత్రి వరకు ఆస్పత్రులకు వస్తూనే ఉన్నారు. వారు చెబుతున్న లక్షణాలనున బట్టి డాక్టర్లు చికిత్స అందిస్తుండటంతో బాధితులు కోలుకుంటున్నారు. అయితే.. ఒక్కసారి ఇంత మంది ఇలా అస్వస్థతకు గురవడానికి కారణాలేంటో ఇప్పటికి స్పష్టత రాలేదు. శనివారం అర్ధరాత్రి వరకు 108 మంది ఆస్పత్రిలో చేరగా… ఇవాళ ఉదయం వరకు ఆ సంఖ్య కాస్త 350 కి చేరుకుంది. వీరిలో 180 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు వెద్య, ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఇవాళ ఏలూరుకు రానున్నారు. ఈ సందర్భంగా బాధితులను స్వయంగా పరామర్శించనున్నారు. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ కూడా ఆరా తీసింది.

Related posts