telugu navyamedia
ఆంధ్ర వార్తలు

కాసేప‌ట్లో ఏపీ మంత్రుల బ‌స్సు యాత్ర ప్రారంభం

*నేటి నుంచిఏపీ మంత్రుల బ‌స్సు యాత్ర ప్రారంభం

*శ్రీకాకుళం నుంచి అనంత‌పురం వ‌ర‌కు బ‌స్సు యాత్ర‌..
*నాలుగురోజులు పాటు కొన‌సాగ‌నున్న యాత్ర‌
*బ‌స్సు యాత్ర‌లోపాల్గొన‌నున్న 17 మంది మంత్రులు ఎమ్మెల్యేలు..

కాసేప‌ట్లో ఏపీ మంత్రుల బ‌స్సు యాత్ర ప్రారంభం కానుంది. ‘సామాజిక న్యాయభేరి పేరుతో ప్రజల్లోకి వెళ్లనున్నారు.

శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వైసీపీ మంత్రుల సామాజిక న్యాయ భేరీ రథం బయలుదేరడానికి సిద్ధమైంది. నాలుగు రోజులు పాటు జ‌ర‌గ‌నున్న ఈ యాత్ర‌లో 17 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన‌నున్నారు.

వైసీపీ బడుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయ‌డం, జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి తదితర అంశాలను ఈ బస్సు యాత్ర లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గానికి చెందిన మంత్రులు రాష్ట్రమంతా తిరుగుతూ వివరించనున్నారు.

 

 

 

Related posts