telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కేసుల మాఫీ కోసం వైసీపీ పోరాటం: చంద్రబాబు

chandrababu gift on may day

కేసుల మాఫీ కోసం వైసీపీ పోరాడుతోందని ఏపీ సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. అమరావతిలోని హ్యాపీ రిసార్ట్స్ లో టీడీపీ సమీక్షా సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ టీడీపీకి నష్టం కలిగించాలనేది బీజేపీ ధ్యేయమని, వారికి కేసీఆర్, జగన్ ల కుతంత్రాలు తోడయ్యాయని అన్నారు. రాష్ట్రంలో ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు కుట్రలు పన్నారని అన్నారు. ముహూర్తాలు, ప్రమాణాలు, మంత్రి పదవులు అంటూ వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని అన్నారు.

టీడీపీ విజయంపై సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీతో మొదట్లోనే గొడవ పెట్టుకుని ఉంటే చాలా నష్టపోయేవాళ్లమ అన్నారు. సరైన సమయంలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చేశామని చెప్పారు. రాష్ట్రం కోసం టీడీపీ పోరాటం చేస్తుంటే పదవులు, కేసుల మాఫీ కోసం వైసీపీ పోరాడుతోందని దుయ్యబట్టారు. వచ్చే రెండు, మూడు సీట్లకు అప్పుడే బేరాలు ప్రారంభించారని విమర్శించారు.

Related posts