telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో నాలుగు ప్యానెల్స్ ధ్వంసం

srishailam power house

శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో నిన్న రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో నాలుగు ప్యానెల్స్ దెబ్బతిన్నాయి.  ఎడమగట్టు భూగర్భ విద్యుత్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది.

4వ యూనిట్ వద్ద కార్మికులు విధుల్లో ఉన్న సమయంలో షార్ట్‌సర్క్యూట్ ఏర్పడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ వెంటనే మంటలు టన్నెళ్లకు వ్యాపించడంతో ఆరు టన్నెళ్లలో నాలుగు పేలిపోయాయి. పేలుడు సంభవించిన సమయంలో మొత్తం 12 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు.

భారీ శబ్దాలతోపాటు రెండు కిలోమీటర్ల సొరంగ మార్గం పూర్తిగా పొగతో నిండిపోయింది. పేలుడు శబ్దాలకు వణికిపోయిన కార్మికుల్లో ఆరుగురు వెంటనే బయటకు పరుగులు తీయగా, మిగతా ఆరుగురు మంటల్లో చిక్కుకుపోయారు. సొరంగంలో కమ్ముకుపోయిన పొగ కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.

Related posts