కాంగ్రెస్ ఎమ్మెల్యే మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.పోడు భూముల సమస్య పరిష్కారం అవుతుందంటే రాజీనామాకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. తాను, తన ప్రజలు సంతోషంగా లేరని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
ప్రజలకు న్యాయం చేయలేని పదవి ఎందుకు అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. అన్ని సమస్యల పరిష్కారానికి తన రాజీనామానే సరైన మార్గమన్నారు. రాజీనామా అంశం తెరపైకి రాగానే గట్టుప్పల్ మండలం ఏర్పాటు చేశారని ఆయన దుయ్యబట్టారు. ఈ విధంగానైనా నియోజకవర్గం అభివృద్ధి అవుతుందనుకుంటే రాజీనామా చేస్తానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలి: ఎర్రబెల్లి