telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలి: ఎర్రబెల్లి

yerrabelli dayakar on ravali case

తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రోజు తిరుమల శ్రీవారిని దయాకర్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ లు సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు.

ఏపీ, తెలంగాణలు అభివృద్ధిలో కలిసి ముందుకు సాగాలనీ చెప్పారు. అందుబాటులో ఉన్న వనరులను ఇరు రాష్ట్రాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుని కేంద్రం నుంచి నిధులు సాధించుకోవాలని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణలో ఇద్దరు సీఎం లు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజలకు చేయూతనిస్తున్నారని ఆయన తెలిపారు.

Related posts