telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సీఎం కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌.. మరో కేంద్రమంత్రితో భేటీ

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో రెండో రోజు ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి, పౌర విమాన‌యాన శాఖ మంత్రి హ‌ర్దీప్‌సింగ్‌పురితో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ర్టంలో కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటు, డ‌బుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి నిధుల విడుద‌ల‌పై కేంద్ర‌మంత్రితో కేసీఆర్ చ‌ర్చిస్తున్నారు. రాష్ట్రంలో చాలారోజులుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్ సంబంధిత శాఖల మంత్రులను కలుస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ప్రధాని మోదీతోపాటు పలువురు మంత్రులను కలిసే అవకాశం ఉన్నది. విభజన హామీలతోపాటు రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రధానితో చర్చించనున్నారు. కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని  కలువనున్నారు. జాతీయ రహదారులకు నిధుల మంజూరుపై గడ్కరీతో చర్చించే అవకాశం ఉన్నది. నిన్న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో సమావేశమయ్యారు. నీటి ప్రాజెక్టులు, నదీ జలాల వినియోగానికి సంబంధించిన అంశాలపై ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు.

Related posts