telugu navyamedia
Uncategorized తెలంగాణ వార్తలు వార్తలు

షర్మిల వ్యాఖ్యల పై స్పందించిన ఎంపీ అరవింద్…

వైఎస్ షర్మిల అన్ని జిల్లాల నేతలు, వైఎస్ అభిమానులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.  లోటస్ పాండ్ లో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా అభిమానులతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దేశంలో పసుపు ఉత్పత్తిలో నిజామాబాద్ నెంబర్-1 అని.. పసుపు బోర్డ్ తెస్తాను అని చెప్పి బీజేపీ ఎంపీ అరవింద్ బాండ్ పేపర్ ఇచ్చారని మండిపడ్డారు. బాండ్ ఇచ్చి రైతులను అరవింద్ మోసం చేశాడని..బాన్సువాడలో మతకల్లోలకు కారణం ఎవరు? అని నిలదీశారు. రాజన్న సంక్షేమం కోసం నేను నిలబడుతమీకోసం నేను పోరాడుతానని.. ఇప్పుడు ఈ జిల్లాలో భూములు రెట్లు పెరిగాయంటే వైఎస్ఆర్ కారణమని తెలిపారు. పసుపు బోర్డు విషయంలో తనపై కామెంట్ చేసిన వైఎస్ షర్మిలకు కౌంటర్ ఇచ్చారు భారతీయ జనతా పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్.. మన తెలంగాణ కోడలు, బ్రదర్ అనిల్‌గారి భార్య సిస్టర్ షర్మిల నన్ను ఎక్కడో గుర్తు చేసుకున్నారాట.. సంతోషం.. కానీ, విషయాలు మాట్లాడే ముందే.. అవగాహన చేసుకుంటే మంచిదని సూచించారు.. మీరు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూతురు అనే విషయాన్ని మర్చిపోవద్దన్న ఆయన… మీ తండ్రి భాగస్వామిగా ఉన్న యూపీఏ, యూపీఏ2 సర్కార్‌ హయాంలో ఉన్న పరిస్థితి మార్చి.. ఇప్పుడు పసుపునకు అత్యధిక ధర కల్పించామన్నారు.

Related posts