telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

రైతులకి న్యాయం చెయ్యమని డిమాండ్ చెయ్యడం జగన్ దృష్టిలో నేరం…

రైతుల్నిపరామర్శించడం,రైతులకి అండగా పోరాటం చెయ్యడం,రైతులకి న్యాయం చెయ్యమని డిమాండ్ చెయ్యడం జగన్ రెడ్డి దృష్టిలో నేరం.ఈ నేరం పై కేసు పెట్టే సెక్షన్లు ఆయన పోలీసుల వద్దలేవు. అందుకే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘన, ట్రాక్టర్ నడిపారంటూ నాపై కేసులు బనాయించారు. వరద బాధితులను పరామర్శించేందుకు గడప దాటని జగన్ రెడ్డి, గడప గడపకీ వెళ్లే నన్ను అడుగడుగునా అడ్డుకోవాలనుకుంటున్నారు. ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో! కష్టాలలో ఉన్నోళ్ల కన్నీరు తుడిచేందుకు ప్రతీ ఊరూ వెళతా! ప్రతి గడపా తొక్కుతా! బాధితులకు భరోసానిస్తా అన్నారు. అయితే ఆకివీడు పోలీస్ స్టేషన్ లో టిడిపి లోకేష్ పై కేసులు నమోదయ్యాయి. ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద అవగాహన లేకుండా  ట్రాక్టర్ నడుపుతూ.. పది మందిని ట్రాక్టర్ ఎక్కించుకుని,  వారి ప్రాణాలకు హాని కలిగే విధంగా డ్రైవింగ్ చేసారని ఒక కారణంగా అలానే  కోవిడ్  19 నిబంధనలు పాటించకుండా కార్యక్రమాలు నిర్వహించినందుకు మరో కారణంగా సుమోటోగా  కేసులు నమోదు చేసారు.

Related posts