telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అయోధ్యపై .. ముస్లిం మేధావుల సంచలన నిర్ణయం.. గిఫ్ట్ గా ఇచ్చేస్తారట..

muslim forum on ayodya issue

ముస్లిం మేధావుల ఫోరమ్‌ అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని హిందువులకు బహుమతిగా ఇచ్చేయడం మేలని సూచించింది. ఒకవేళ కోర్టు తీర్పు మనకి అనుకూలంగా వచ్చినా సరే, దానిని ఓ బహుమతిగా ఇచ్చేయాలి. ఎందుకంటే ఆ స్థలం దక్కినా మనం మసీదును నిర్మించగలమా? అది అసంభవం. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణంలో ఇలా మసీదును పునర్నిర్మించడం ఓ కలే అవుతుంది. ఆ భూమిని వాళ్లకిచ్చేసి ప్రతిగా ప్రార్థనా స్థలాల సవరణ చట్టాన్ని బలోపేతం చేయమని అడుగుదాం. దానిపై ఖచ్చితమైన హామీని తీసుకుందామని ఇండియన్‌ ముస్లింస్‌ ఫర్‌ పీస్‌ అనే ఆ ఫోరమ్‌ సూచించింది.

అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ జమీరుద్దీన్‌ షా సహా పలువురు విద్యావేత్తలు ఇందులో సభ్యులు. అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టులో వాదనలు తుది దశకు చేరుకుంటున్న దశలో ఓ ముస్లిం గ్రూప్‌ నుంచి ఈ రకమైన ప్రతిపాదన రావడం విశేషం. అయితే ఈ గ్రూపు ప్రస్తుతం కోర్టు వాదనల్లో కక్షిదారు కాదు.

Related posts