శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది. ఘటన జరిగిన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ శర్మన్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… షార్ట్సర్య్యూట్ వలనే ప్రమాదం జరిగిందన్నారు. అండర్ గ్రౌండ్లో దట్టంగా పొగ అలుముకుందని దీంతో 9 మంది అక్కేడే ఉండిపోయారని తెలిపారు.
పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది లోపల చిక్కుకున్నవారిని కాపాడేందుకు వెళ్లి.. పొగ కారణంగా వెనక్కు వచ్చారని తెలిపారు. రాత్రి 10.30 గంటలకు మొదటి యూనిట్లో ఫైర్ జరిగిందని కలెక్టర్ చెప్పారు. జెన్ కో ఆసుపత్రిలో ఆరుగురు చికిత్స పొందుతున్న వారి పరిస్థితి మెరుగ్గానే ఉందని చెప్పారు.