telugu navyamedia
రాజకీయ వార్తలు

నేడు జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్న అమిత్ షా

TDP Mla anitha comments Roja YCP

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నారు. యాత్ర ప్రారంభానికి ముందుగా గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో చారిత్రాత్మక జగన్నాథ మందిరంలో మిత్ షా పూజలు చేశారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో జమాల్పూర్ జగన్నాథ మందిరానికి చేరుకున్న అమిత్ షా స్వామివారికి మంగళహారతులిచ్చారు. అమిత్ షా రెండు రోజుల పర్యటనకుగాను అహ్మదాబాద్ వచ్చారు.

ప్రతేయేటా ఇక్కడ ఘనంగా జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తుంటారు. 14 కిలోమీటర్ల పొడవున ఈ రథయాత్ర కొనసాగుతుంది. ఈ ఉత్సవం కోసం మూడు రథాలు, 19 గజరాజులు, 100 ట్రక్కులు వినియోగించనున్నారు. అలాగే రథయాత్ర మార్గంలో 25 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related posts