telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జగన్ అక్రమాస్తుల కేసులో.. సబితా ఇంద్రారెడ్డికి సమన్లు!

sabita reddy rangareddy tour as minister

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆమెతో పాటు ఏపీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, రిటైర్డ్ అధికారులకు సమన్లు జారీ అయ్యాయి.

ఈ కేసులో భాగంగా పెన్నా సిమెంట్స్ కు భూముల కేటాయింపు వ్యవహారంలో అవకతవకల విషయమై దాఖలైన అనుబంధ ఛార్జిషీట్ ను సీబీఐ న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా రిటైర్డ్ అధికారులు శామ్యూల్, వీడీ రాజగోపాల్, డీఆర్వో సుదర్శన్ రెడ్డి, తహశీల్దార్ ఎల్లమ్మకు సమన్లు జారీ చేసింది. ఈ కేసు విచారణ నిమిత్తం ఈ నెల 17న నిందితులు హాజరు కావాలని ఆదేశించింది.

Related posts