telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

పోటీకి .. ‘పాల్’ సిద్ధం.. నర్సాపురం నుండి..

indian christian political front on ka pal

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాను ఎక్కడి నుంచి బరిలోకి దిగబోతున్నది ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి లోక్‌సభకు పోటీ చేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు. అలాగే, మరో స్థానం నుంచి కూడా పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. ఈ నెల 22న నామినేషన్ వేయనున్నట్టు చెప్పిన ఆయన నేడు ప్రజాశాంతి పార్టీ నుంచి బరిలోకి దిగబోతున్న అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయబోతున్నట్టు తెలిపారు.

పాల్ పవన్ కల్యాణ్‌పై మరోమారు తీవ్ర విమర్శలు చేశారు. పవన్ సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని మూసేసినట్టుగానే పవన్ కూడా జనసేనను మూసివేస్తారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌ను అమెరికాలా మార్చే సత్తా కేవలం ప్రజాశాంతి పార్టీకే సాధ్యమన్నారు. హెలికాప్టర్‌లలో తిరుగుతున్న నేతలకు ఓట్లు వేయొద్దని, కానీ హెలికాప్టర్ గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు. విజయవాడ సెంట్రల్ నుంచి బరిలోకి దిగుతున్న టీడీపీ అభ్యర్థి బోండా ఉమ తనకు ఫోన్ చేసి ఆశీస్సులు కోరారని పాల్ తెలిపారు.

Related posts