రాజధానిని అమరావతి నుంచి తరలించే శక్తి ఎవరికీ లేదని టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు అన్నారు. తల నొప్పి వస్తే ఎవరైనా మాత్ర వేసుకుంటారని, తల తీసేయరని చెప్పారు. విజయనగరంలోని టీడీపీ కార్యాలయంలో ఈరోజు విపక్షాలు భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు.
అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు కోర్టుకు హాజరైన సంగతిని ఆయన ప్రస్తావించారు. ముఖ్యమంత్రి హోదాలో జయలలిత తర్వాత కోర్టు బోనులో నిలబడింది జగన్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. బోనులో నిలబడి రాష్ట్రానికి తలవంపులు తేవడం సిగ్గుచేటని అన్నారు.