telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజధానిని తరలించే శక్తి ఎవరికీ లేదు: అశోక్ గజపతిరాజు

chandrababu wishes to ashok birthday

రాజధానిని అమరావతి నుంచి తరలించే శక్తి ఎవరికీ లేదని టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు అన్నారు. తల నొప్పి వస్తే ఎవరైనా మాత్ర వేసుకుంటారని, తల తీసేయరని చెప్పారు. విజయనగరంలోని టీడీపీ కార్యాలయంలో ఈరోజు విపక్షాలు భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు.

అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు కోర్టుకు హాజరైన సంగతిని ఆయన ప్రస్తావించారు. ముఖ్యమంత్రి హోదాలో జయలలిత తర్వాత కోర్టు బోనులో నిలబడింది జగన్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. బోనులో నిలబడి రాష్ట్రానికి తలవంపులు తేవడం సిగ్గుచేటని అన్నారు.

Related posts