ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఆరేళ్లలో చేసింది శూన్యమని విమర్శించారు. రాష్ట్రంలో మున్సిపాలిటీల పరిస్థితి గత ఆరేళ్లలో ఏమాత్రం మారలేదనిఅన్నారు. మున్సిపాలిటీలకు ఏం చేశారని ఓట్లు అడగబోతున్నారని ఉత్తమ్ ప్రశ్నించారు.
ఓటర్ల జాబితా, రిజర్వేషన్లను పూర్తి స్థాయిలో ప్రకటించకుండానే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కావాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తాము లేవనెత్తిన అభ్యంతరాలను ప్రభుత్వం, ఈసీ పట్టించుకోలేదని మండిపడ్డారు.