telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

విద్యార్థుల ఆత్మహత్యలన్నీ సర్కారు హత్యలే: పొన్నం

PCC Ponnam comments KCR Federal Front

ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలన్నీ సర్కారు హత్యలేనని కాంగ్రెస్ నేత, కరీంనగ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు. ప్రభుత్వంపై హత్యా నేరం కేసు నమోదు చేయాలన్నారు. విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఇంటర్ బోర్డును తక్షణమే ప్రక్షాళన చేయాలని పొన్నం డిమాండ్ చేశారు.

విద్యా వ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో పార్టీ ఫిరాయింపులుకు పాల్పడుతున్నారన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాడుతుందని పొన్నం స్పష్టం చేశారు.

Related posts