కాంగ్రెస్ పార్టీ నుండి తెలంగాణలో గెలిచిన ఎమ్మెల్యేలు వరుసగా.. టీఆర్ఎస్ పార్టీలోకి క్యూ కట్టారు.. ఇది పార్టీపై తీవ్ర ప్రభావాన్నే చూపింది.. మరోవైపు.. ఈ ఎన్నికల ఫలితాలు వెలువడి కొంత కాలం నుంచి భారతీయ జనతా పార్టీ పాట పాడుతున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. అవకాశం దొరికినప్పుడల్లా.. ప్రధాని మోడీపై, ఎన్డీఏ సర్కార్పై ప్రశంసలు కురిపిస్తూ వచ్చారు.. అంతేకాదు.. పార్టీ అధిష్టానంపై కూడా హాట్ కామెంట్లు చేసి.. వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది.. కానీ, మరోసారి ఆయన బీజేపీపై చేసిన కామెంట్లు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో కాకరేపుతున్నాయి. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సవాల్ విసిరారు.. రాజగోపాల్ రెడ్డి.. ఎన్నికల్లో కాంగ్రెస్ సింబల్ పై గెలిచాడని గుర్తుచేసిన ఆయన.. సొంత బలంతో గెలిచడాని అనుకుంటే.. రాజీనామా చేసి.. మళ్లీ పోటీచేసి గెలవాలని కోమటిరెడ్డికి సూచించారు.. కాంగ్రెస్ పార్టీని ఇలా బ్లాక్ మెయిల్ చేయడం సరైంది కాదని హితబోధన చేశారు జీవన్ రెడ్డి. కాగా, ఓవైపు రాజగోపాల్ రెడ్డి సోదరుడు, ఎంపీ కోటమిరెడ్డి వెంకట్రెడ్డి పీసీసీ చీఫ్ పోస్ట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.
previous post
రేపు పాకిస్థాన్ కూడా టార్గెట్.. ఆరెస్సెస్ పై ఇమ్రాన్ ఫైర్