telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

క్రిష్ కు కరోనా పాజిటివ్…

Krish

చైనా నుండి వచ్చిన మన దేశంతో పాటు ప్రపంచంలోని మిగిత దేశాలను కూడా వణికిస్తోంది. అయితే 2019 వచ్చిన ఈ వైరస్ తీవ్రత రోజు రోజుకు ఎక్కువ అవుతోంది. ఇప్పటికే ఈ వైరస్‌ భారీన పడ్డారు. ఈ వైరస్‌ పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ సోకుతోంది. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది కరోనా బారీన పడ్డారు.  ఇటీవలే మెగా పవర్‌ స్టార్‌ రాం చరణ్‌, వరుణ్‌తేజ్‌ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. రామ్‌ చరణ్‌ కరోనా బారిన పడ్డ తర్వాత కొద్ది సేపటికే వరుణ్‌ తేజ్‌కు కూడా పాజిటివ్‌ వచ్చింది. అయితే.. తాజాగా డైరెక్టర్ క్రిష్ కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రామ్‌ చరణ్‌, వరుణ్‌ తేజ్‌ల పార్టీలో క్రిష్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే క్రిష్‌కు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది.  ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్న క్రిష్.. జనవరి 4నుంచి షూటింగ్ కు ప్లాన్ చేసాడు.  షూటింగ్ లో పాల్గొనే సిబ్బంది అంతా చేయించుకున్న కరోనా టెస్టులలో క్రిష్ కు పాజిటివ్  నిర్ధారణ అయింది. దీంతో షూటింగ్ కాన్సిల్ చేసేశాడు నిర్మాత ఏ ఎం రత్నం. చూడాలి మరి మళ్ళీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది.

Related posts