telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

tirumala temple

తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దర్శ నానికి 27 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య అధికంగా ఉండటంతో అద్దె గదులకు కొరత ఏర్పడింది. దీంతో భక్తులు ఆరుబయట, షెడ్ల కింద చలిలో నానా ఇబ్బందులకు గురవుతున్నారు.

స్వామి సర్వ దర్శనానికి 10 గంటల వరకూ సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్, దివ్య దర్శనం టోకెన్, రూ. 300 ప్రత్యేక దర్శనం భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల్లో దర్శనం పూర్తవుతుందని తెలిపారు. నిన్న స్వామివారిని 83 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు.

Related posts