ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్పై కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ విరుచుకుపడ్డారు. యూపీలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోజురోజుకు మహిళలకు భద్రత కరువైతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రియాంక ప్రశ్నించారు.
హత్రాస్కు చెందిన దళిత యువతిపై సామూహిక అత్యాచారం చేసిన నలుగురు దుండగులకు కఠిన శిక్ష విధించాలని ప్రియాంక డిమాండ్ చేశారు. బాధిత యువతి గత రెండు వారాలుగా మృత్యువుతో పోరాడి ఓడిందని ఆమె పేర్కొన్నారు. క్రిమినల్స్ బహిరంగ నేరాలకు పాల్పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రియాంక ఆరోపించింది.
ఏపీలో అరాచక పాలన..కేంద్రం దృష్టిసారించాలి: యనమల