telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పార్టీ బలోపేతానికి జనసేన చర్యలు

pawan-kalyan

ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని ప్రచారం ఊపందుకోండి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. తాజాగా, జనసేన సంయుక్త పార్లమెంటరీ కమిటీలను ప్రకటించారు. ఏపీలో 25 లోక్ సభ స్థానాలు ఉండగా, 5 సంయుక్త పార్లమెంటరీ కమిటీలను నియమించారు.

ఉత్తరాంధ్ర సంయుక్త కమిటీ, గోదావరి సంయుక్త కమిటీ, సెంట్రల్ ఆంధ్ర సంయుక్త కమిటీ, రాయల దక్షిణ కోస్తా సంయుక్త కమిటీ, రాయలసీమ సంయుక్త కమిటీలను ఏర్పాటు చేసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు జనసేనాని పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ నుంచి ఓ ప్రకటన వెలువడింది.

Related posts