telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

రాయితీ లడ్డూ విధానానికి టీటీడీ స్వస్తి!

ttd plans to venkanna temples in mumbai and j & K

రాయితీ లడ్డూ విధానానికి నేటితో తిరుమల తిరుపతి దేవస్థానం స్వస్తి పలకనుంది. లడ్డూ ప్రసాదం పంపిణీలో ఈ రోజు అర్థరాత్రి నుంచి కొత్త విధానం ప్రవేశపెట్టనున్నట్లు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ప్రతి భక్తులడికీ ఉచితంగా ఒక్క లడ్డూ మాత్రమే అందిస్తామని తెలిపారు.

ప్రతీ అదనపు లడ్డూ కోసం రూ.50 చొప్పున చెల్లించాలని పేర్కొన్నారు. రోజుకు 4 లక్షల లడ్డూలు తయారు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. భక్తులకు కావాల్సినన్ని లడ్డూలు అందించేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సేవా టికెట్లు, వీఐపీ బ్రేక్‌, ప్రత్యేక దర్శనం చేసుకునే భక్తులకు కొత్త విధానం అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Related posts